బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న వారిపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నెరేడ్మెట్ పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతురావు ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్ల కారణంగా డబ్బు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. అలాంటి యాప్ లను ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.