నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం కల్వకుర్తి విద్యానగర్ భగత్ సింగ్ కాలనీ నూతన కార్యవర్గం సోమవారం ఏర్పాటయింది. భగత్ సింగ్ కాలనీ గౌరవాధ్యక్షులుగా జయప్రసాద్, అధ్యక్షులుగా ఎముక జంగయ్య, ప్రధాన కార్యదర్శిగా గోపాల్, కోశాధికారిగా నాగభూషణ్, ఉపాధ్యక్షులుగా లింగారెడ్డి, జగదీష్, గౌరవ సలహాదారునిగా శంకర్ నాయక్, కార్యదర్శులుగా రాజు, మహేష్, చంద్రశేఖర్, అమర్నాథ్ రెడ్డి, సాయిబాబు, పరిపూర్ణాచారి, తధితరులు ఉన్నారు.