తమిళనాడులోని కొరట్టూరు రైల్వేస్టేషన్లో విద్యార్థులు కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడి స్థానిక కళాశాల విద్యార్థులలోని రెండు గ్రూపులు గ్యాంగ్ వార్కు దిగాయి. ఈ ఘర్షణలో వారు రైలుపై దాడి చేశారు. దీంతో రైలు ధ్వంసం కావడంతో పాటు అందులోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇలాంటి విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.