దేవరకొండ: పట్టణానికి చెందిన బీసీ ఉద్యమ నేత చోల్లేటి భాస్కరాచారి మహాత్మా జ్యోతిబా పూలే జాతీయ అవార్డును అందుకున్నారు. గత 45 సంవత్సరాలుగా భాస్కరాచారి చేస్తున్న సామాజిక సేవను రాష్ట్ర సెలక్షన్ కమిటి గుర్తించింది. ఈ నెల 10న పూణేలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ చైర్మన్ రాధాకృష్ణ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. కాగా అవార్డుకు ఎంపిక చేసిన శ్రీనివాస్ గౌడ్, తదితరులకు భాస్కరాచారి బుధవారం కృతజ్ఞతలు తెలిపారు.