108 వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

61చూసినవారు
డిండి: ఎన్నికల సమయంలో మండల ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం 108 వాహనాన్ని మంజూరు చేయించానని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. గురువారం డిండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంబులెన్స్ వాహనాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యం ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందన్నారు. గత ప్రభుత్వం శ్రీశైలం హైదారాబాద్ హైవే ఉన్న డిండికి అంబులెన్స్ కేటాయించకపోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్