ప్రమాదవశాత్తు సాగర్ కాలువలో పడి యువకుడు మృతి

81చూసినవారు
నల్గొండ జిల్లా నిడమనూరు వేంపాడు వద్ద గురువారం సాగర్ కాలువలో పడి యువకుడి గల్లంతయ్యాడు. వేంపాడు గ్రామానికి చెందిన ప్రభాస్ కాలకృత్యాల కోసం ఎడమ కాలువ వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతయ్యాడు. గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. ప్రభాస్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్