సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు.. తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఏచూరి, తల్లి కల్పకం ఏచూరి. వాస్తవానికి ఏచూరి కుటుంబానిది కాకినాడ కాగా.. తండ్రి ఏపీఎస్ ఆర్టీసీలో ఇంజనీర్.. తల్లి ప్రభుత్వ అధికారి. ఏచూరి భార్య ప్రముఖ పాత్రికేయురాలు, రచయిత్రి సీమా చిస్తీ. బ్రిటన్లో యూనివర్సిటీ టీచర్గా పనిచేస్తున్న అఖిలా ఏచూరి, జర్నలిస్టు ఆశిష్ ఏచూరిల పిల్లలు. పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి 2021 ఏప్రిల్ 22న కొవిడ్తో చనిపోయారు.