అవగాహన రాహిత్యంతో మతిభ్రమించి మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ మాట్లాడుతున్నారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాన ని టీపీసీసీ సెక్రెటరీ కర్నాటి లింగారెడ్డి అన్నారు. బుధవారం నాగార్జునసాగర్ హిల్ కాలనీ లోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ. ఈ 19 క్వార్టర్స్ ఖాళీ చేయించడంలో రాజకీయ దురుద్దేశం కానే కాదని కేవలం అధికారులు న్యాయబద్ధంగా చేసిన కార్యక్రమమని అన్నారు.