ఈనెల 23 వరకు దరఖాస్తు చేసుకోవాలి: ప్రిన్సిపాల్

55చూసినవారు
ఈనెల 23 వరకు దరఖాస్తు చేసుకోవాలి: ప్రిన్సిపాల్
గుండ్లపల్లి (డిండి) మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి ఓ ప్రకటనలో కోరారు. పీజీటీ తెలుగు-1, ఇంగ్లీష్-1, మాథ్స్-2, ఎకనామిక్స్-1, కామర్స్-1, టీజీటీ ఇంగ్లీష్-1, సబ్జెక్టులలో ఖాళీలు ఉన్నాయని శుక్రవారం తెలిపారు. ఈనెల 23 వరకు పాఠశాలలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 9490596989 నెంబర్ ను సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్