ప్రజలకు ఇబ్బందిగా మారిన 33/11 కెవి సబ్ స్టేషన్ విస్తరణ

62చూసినవారు
ప్రజలకు ఇబ్బందిగా మారిన 33/11 కెవి సబ్ స్టేషన్ విస్తరణ
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామం ఒక ప్రైవేటు కంపెనీ కొరకు చేస్తున్న 33/11 కెవి సబ్ స్టేషన్ విస్తరణ పనులు వెలిమినేడు గ్రామ ప్రజలకు శాపంగా మారాయని మాజీ ఎంపీటీసీ దేశ బోయిన స్వరూప నరసింహ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ప్రజల సౌకర్యార్థం ఈ సబ్ స్టేషన్ విస్తరణ కొరకు కరెంటు అధికారులకు పలుమార్లు విన్నవించుకున్న పట్టించుకోలేదని ఆరోపించారు. స్తంభాలు కాకుండా టవర్లు నాటాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్