ఆర్టీఐ రక్షక్ నల్లగొండ జిల్లా ప్రెసిడెంట్ గా కూనురు మధు

65చూసినవారు
ఆర్టీఐ రక్షక్ నల్లగొండ జిల్లా ప్రెసిడెంట్ గా కూనురు మధు
నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన కూనురు మధును ఆర్టీఐ రక్షక్ జిల్లా ప్రెసిడెంట్ గా నియమిస్తూ అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ ఆదివారం నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం 2005 పౌరులకు ఒక ఆయుధంగా ఉంటుందని, సమాచార హక్కు చట్టం ద్వారా అవినీతి అక్రమాలను బయటపెడతామని, మన సమాజ నిర్మాణం కోసం పాటుపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో కళ్లెం చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్