జిల్లా అధికారులు వారంలో 3 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి

72చూసినవారు
జిల్లా అధికారులు ప్రభుత్వ ప్రాధామ్య పథకాల అమలులో నల్గొండ జిల్లాను మొదటి స్థానంలో ఉంచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం ఆయన మొదటిసారిగా జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. జిల్లా అధికారులు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఆయా పథకాల అమలుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్