గౌరవ హై కోర్టు వారు ధర్నాకు అనుమతించారని వారి సూచనల మేరకు ప్రశాంతంగా ధర్నా నిర్వహిస్తామని నల్గొండ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం నల్లగొండ గడియారం సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైతు మహా ధర్నాకు కేటీఆర్ హాజరవుతున్న విషయం తెలిసిందే. ఈ ఏర్పాట్ల ను మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, బి ఆర్ ఎస్ నాయకులు ఒంటెద్దు నరసింహారెడ్డి పర్యవేక్షించారు.