భూమిని పట్టా చేయనందుకే హత్య

85చూసినవారు
భూమిని పట్టా చేయనందుకే హత్య
ఈనెల 17న నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లిలో దారుణ హత్య జరిగిన విషయం తెలిసిందే. సీఐ కొండల్ రెడ్డి వివరాల ప్రకారం.. పిట్టల సైదులు పేరు మీద ఉన్న 2 ఎకరాల భూమి పట్టా చేయాలని కొడుకు నవీన్, భార్య ప్రమీల ఒత్తిడి తెచ్చారు. సైదులు అందుకు నిరాకరించడంతో ప్రమీల, నవీన్ కలసి రోకలి బండతో హత్య చేసినట్లు తెలిపారు. నిందితులు మండలంలోని కొండకింద గూడెం శివారులో సంచరిస్తుండగా అరెస్టు చేశామన్నన్నారు.

సంబంధిత పోస్ట్