నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎర్రసాని గూడెం గ్రామ శివారులోని జాతీయ రహదారి పక్కన ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానికుల వివరాలిలా.. కొల్లూరి రాజా వర్ధన్(35) అనే వ్యక్తి హైవే పక్కన మృతిచెంది ఉన్నాడు. అతడిది కృష్ణా జిల్లా పామూరుకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.