ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనాపార్టేకు చెందిన అరుదైన వస్తువులు వేలం వేశారు. వీటిల్లో రెండు పిస్తోళ్లు ఉన్నాయి. వీటిల్లో ఒకటి తన ఆత్మహత్యకు వినియోగించాలని నెపోలియన్ భావించాడు. వీటిని వేలం వేయగా 1.69 మిలియన్ యూరోలకు అవి అమ్ముడుపోయాయి. భారత కరెన్సీ ప్రకారం రూ.15 కోట్లు పైమాటే. నెపోలియన్ వాడిన తుపాకులను లూయిస్ మెరైన్ గోస్సెట్ అనే కంపెనీ తయారుచేసింది. ఆ కంపెనీ ఆశించిన మొత్తం కంటే ఎక్కువే ఈ వేలంలో లభించింది.