కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ షాక్ ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో సోనియా, రాహుల్ పేర్లను చేర్చింది. దీంతో ఛార్జ్షీట్పై ఈనెల 25న రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ వాదనలు వినిపించనుంది. కాగా ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ ఆస్తుల జప్తునకు ఈడీ నోటీసులు జారీ చేసింది.