ఏపీలో అక్టోబరు నుంచి కొత్త మద్యం విధానం: మంత్రి కొల్లు

73చూసినవారు
ఏపీలో అక్టోబరు నుంచి కొత్త మద్యం విధానం: మంత్రి కొల్లు
ఏపీ అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్ చెప్పారు. మంచి మద్యం పాలసీని త్వరలోనే తీసుకొస్తామని తెలిపారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త పాలసీని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరించారు. ఆరు రాష్ట్రాల్లోని మద్యం పాలసీలను అధ్యయనం చేస్తున్నామన్నారు. తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందించేలా పాలసీ రూపొందించినున్నట్లు తెలిపారు. దీనిపై ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం జరిగిందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్