తెలంగాణలో కొత్త విద్యా సంవత్సరం నుంచి టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్(FRS)ను అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. స్కూళ్లకు అందజేసిన ట్యాబ్/స్మార్ట్ ఫోన్లలో జూన్ 12లోపు FRS యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించింది. ఉపాధ్యాయుల ఫొటోల ద్వారా ఆ రోజు ఎంత మంది పాఠశాలకు వచ్చారో ఆ యాప్ రిజిస్టర్ చేసుకుంటుంది.