ఇంట్లో గ్యాస్ లీకై చెలరేగిన మంటలు

50చూసినవారు
జన్నారం మండల కేంద్రంలోని ఓ ఇంట్లో బుధవారం వంట గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. మండలానికి చెందిన రైస్ మిల్ ఆపరేటర్ లక్ష్మణ్ ఇంట్లో అకస్మాత్తుగా వంట గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదని అగ్నిమాపక సిబ్బంది లక్ష్మణ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్