రన్నింగ్ తో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది

83చూసినవారు
రన్నింగ్ తో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
రన్నింగ్ తో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నిర్మల్ పట్టణానికి చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ లక్ష్మీనరసింహారెడ్డి అన్నారు. ప్రజలలో రన్నింగ్ పై అవగాహన పెంచేందుకు ఆయన ఆదివారం నిర్మల్ పట్టణం నుండి ఖానాపూర్ వరకు సుమారు 35 కిలోమీటర్ల దూరాన్ని రన్నింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి వ్యాయామం అవసరమని, దాని ద్వారా క్రమశిక్షణతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. ఆయనను పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్