కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ప్రజాపక్షమని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని కోరుతూ బుధవారం లక్కారం గ్రామంలోని పలు వార్డులలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధికి, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఉద్యమ మహిళ ఆత్రం సుగుణను ఎంపీగా గెలిపించుకుందామని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.