కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయం

574చూసినవారు
కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క గెలుపు ఖాయమని కాంగ్రెస్ కడెం మండల అధ్యక్షులు మల్లేష్ యాదవ్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కడెం మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆదిలాబాద్ ఎంపీ నియోజకవర్గ స్థానాన్ని సుగుణక్కకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆత్రం సుగుణక్కకు ఉమ్మడి జిల్లా సమస్యలు తెలుసని, ఆ సమస్యల పరిష్కారానికి ఆమె కృషి చేస్తారన్నారు. ఆత్రం సుగుణక్కను గెలిపించుకుంటామని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్