హామీలు నెరవేర్చక మోసం చేసింది

66చూసినవారు
హామీలు నెరవేర్చక మోసం చేసింది
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చక కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ జాన్సన్ నాయక్ విమర్శించారు. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు తరపున శుక్రవారం ఖానాపూర్ పట్టణంలోని కూరగాయల మార్కెట్లో ఆయన చిరు వ్యాపారులను కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. చిరు వ్యాపారులకు మేలు చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని, సక్కును గెలిపించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్