ఉక్కపోతతో ప్రజలు సతమతం

66చూసినవారు
ఉక్కపోతతో ప్రజలు సతమతం
ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు ఉక్క పోత, ఎండ తీవ్రతతో సతమతమవుతున్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో శనివారం మ. 3 గంటలకు 39 నుండి 41 డిగ్రీల మధ్య పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది గత సంవత్సరం కంటే 4 డిగ్రీలు ఎక్కువగా ఉందని వారు తెలిపారు. రాబోయే మూడు రోజులపాటు పగటి ఉష్ణోగ్రతలు 39 నుండి 42 డిగ్రీల మధ్య నమోదయి ఎండ తీవ్రత ఉంటుందన్నారు. మధ్యాహ్నం వేళ ప్రజలు బయటకు వెళ్ళ వద్దన్నారు.

సంబంధిత పోస్ట్