టీచర్లను నియమించాలని విద్యార్థుల ఆందోళన

81చూసినవారు
కడెం మండలంలోని పెద్దుర్ ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఇద్దరు టీచర్లను నియమించాలని కోరుతూ ఆ పాఠశాల చిన్నారులు ఆందోళన నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం కడెం మండల కేంద్రంలోని పెద్దూర్ గ్రామ ప్రధాన రహదారిపై వారు ఆందోళన చేశారు. పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులను నియమించడంతో పాటు పాఠశాలలో త్రాగు నీటి వసతి కల్పించాలని, అన్ని సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్