దంచి కొడుతున్న ఎండలు

542చూసినవారు
ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు దంచుకుంటున్నాయి. నియోజకవర్గంలోని పలు మండలాల్లో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు 40 నుంచి 42 డిగ్రీల మధ్య పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జన్నారం మండలంలో 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా, పలు మండలాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయినట్టు అధికారులు తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్