అంగన్వాడి కేంద్రాల సేవలను గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని ఖానాపూర్ ఐసిడిఎస్ సిడిపిఓ శ్రీలత కోరారు. సోమవారం మధ్యాహ్నం ఖానాపూర్ మండలంలోని పలు సెక్టార్ల అంగన్వాడీ టీచర్లతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెలరోజుల పాటు అంగన్వాడి కేంద్రాలలో నిర్వహించిన పోషణ మాసంపై సమీక్షను నిర్వహించి సూచనలు చేశారు.