అడలి పోచమ్మను దర్శించుకున్న ఎంపి అభ్యర్థి ఆత్రం సుగుణ
నిర్మల్ జిల్లా మామడ మండలం రచ్ఛకొట గ్రామంలో గల అడలి పోచమ్మ ఆలయాన్ని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎంపీ ఆత్రం సుగుణ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పంద్రం జాలింషా మహారాజ్ అధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆమె వెంట నాయకులు కార్యకర్తలు ఉన్నారు.