కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది: ఎమ్మెల్యే

50చూసినవారు
కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ పార్లమెంట్ కిసాన్ మోర్చా రైతు సమ్మేళన సమావేశంలో హాజరై మాట్లాడారు. రైతంగానికి రూ. 2లక్షల రుణమాఫీ, రైతు బంధు ఇస్తానని చెప్పి మోసం చేసిందని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీకీ ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. భారీ మెజారిటీతో బీజేపీ గెలుపు ఖాయం అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్