ముధోల్ నియోజకవర్గంలో మూడు మండలాలు ఏర్పాటు చేయండి

82చూసినవారు
ముధోల్ నియోజకవర్గంలో మూడు మండలాలు ఏర్పాటు చేయండి
ముధోల్ నియోజకవర్గంలో కొత్తగా మూడు మండలాలు ఏర్పాటు చేయాలని శాసనసభలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడారు. బేల్ తరోడ, పల్సి, మాలేగాం గ్రామాలను మండలాలుగా ప్రకటించాలన్నారు. 30 మండలాలను ఏర్పాటు చేస్తున్నట్లు జారీ చేసిన జీవోలో తమ నూతన మండలాల పేర్లు లేవని, తక్షణమే జాబితాలో చేర్చి కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని మంగళవారం కోరారు.

సంబంధిత పోస్ట్