అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

8716చూసినవారు
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం ముధోల్ మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ సాయి కిరణ్ వివరాల ప్రకారం గ్రామానికి చెందిన హంగిరిగొల్ల రాము (38) తనకున్న రెండున్నర ఎకరాల భూమిలో పత్తి, సొయా సాగు చేశాడు. ఆశించిన దిగుబడి రాకపోవడంతో పంటలకు తెచ్చిన అప్పులను ఎలా తీర్చాలనే ఆవేదనకు గురై ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్