నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి తులం బంగారాన్ని మాజీ సర్పంచ్ లక్ష్మణరావు సమర్పించినారు. దసరా నవరాత్రి ఉత్సవాలు గురువారం నుండి ప్రారంభం కానున్న సమయంలో ఈరోజు ఉదయం 6 గంటలకి కుటుంబ సభ్యులతో వెళ్లి బంగారాన్ని సమర్పించారు. ఆలయ ఈవో మాట్లాడుతూ, రెండు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. కావున వాళ్లకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పారు.