కుంటాల మండలంలో ప్రసిద్ధ శ్రీ గజ్జలమ్మ ఆలయంలో ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. హైదరాబాద్కు చెందిన గజ్జారం అమ్మవారికి మకర తోరణం, (ఇత్తడి)కిరీటాన్ని సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా ఆలయ కమిటీ సభ్యులు చర్యలు తీసుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.