బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

83చూసినవారు
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
కుంటాల మండలం ఓల గ్రామానికి చెందిన మాజీ మంత్రి అల్లొల్ల ఇంద్రకరణ్ రెడ్డి వ్యక్తిగత పీఏ నాళం శ్రీనివాస్ తండ్రి నాళం గంగారాం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. బుధవారం ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ గ్రామానికి చేరుకొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట బీజేపీ నాయకులు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్