ముధోల్ మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన మెత్రి నరేందర్ ఇటీవలె విద్యుత్ షాక్ తో మృతి చెందారు. విషయం తెలిసుకున్న ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మంగళవారం గ్రామానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.