పార్డి (కే) గ్రామంలో అడవి పంది హల్ చల్

50చూసినవారు
నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పార్డి (కే) గ్రామంలో అడవి పంది హల్ చల్ చేసింది. బుధవారం మధ్యాహ్న సమయంలో దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతం నుంచి గ్రామంలోని చొరబడింది. అడవి పందిని చూసిన గ్రామస్తులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. వీధి కుక్కలు అడవి పందిని తరిమికొట్టడంతో గ్రామాస్తులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు అడవి పందుల బారి నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్