కుబీర్ లో కుస్తీ పోటీలు

69చూసినవారు
కుబీర్ మండల కేంద్రంలో ఉగాది పండుగ పురస్కరించుకొని విఠలేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కుస్తీ పోటీలను నిర్వహించారు. ఈ కుస్తీ పోటీల్లో తెలంగాణ తో పాటు మహారాష్ట్ర నుండి మల్లయోధులు వచ్చి పోటీల్లో తలపడ్డారు. కుస్తీ పోటీలో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి రూ. 6 వేలు, రెండవ బహుమతి రూ. 4 వేలు అందజేయనున్నట్లు తెలిపారు. అందజేయనున్నారు. పోటీలను తిలకించడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్