పొన్కల్ లో అంగరంగ వైభవంగా రథోత్సవం

67చూసినవారు
మామడ మండలం పొన్కల్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. బుధవారం రథోత్సవాన్ని నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంలో దేవతామూర్తుల విగ్రహాలను పూలమాలలతో సర్వంగసుందరంగా అలంకరించారు. మహిళల మంగళహారతులు బాజా భజంత్రీల నడుమ గ్రామ పురవీధుల గుండా ఊరేగింపు చేపట్టారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్