వైసీపీ ప్రభుత్వ అసమర్థతతోనే నష్టం

55చూసినవారు
వైసీపీ ప్రభుత్వ అసమర్థతతోనే నష్టం
వైసీపీ ప్రభుత్వ అసమర్థ ప్రణాళిక వల్లే డయాఫ్రం వాల్‌ దెబ్బతిందని నీతి ఆయోగ్‌ నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలు లీకవుతున్నాయి. డయాఫ్రం వాల్‌ ధ్వంసమయింది. అది బాగు చేయాలా? కొత్తది నిర్మించాలా అన్నది తేలాల్సి ఉంది. సకాలంలో ఎగువ కాఫర్‌ డ్యాం గ్యాప్‌లను పూడ్చకపోవడం వల్లే 2020 వరదల్లో డయాఫ్రం వాల్‌ దెబ్బతిందని ఐఐఐటీ కమిటీ తేల్చిచెప్పింది. డయాఫ్రం వాల్‌ను అప్పట్లో రూ.436 కోట్లతో నిర్మించాం. కొత్తది నిర్మించాలంటే రూ.990 కోట్లు ఖర్చవుతుంది.

సంబంధిత పోస్ట్