పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సీఎం చంద్రబాబు స్వయంగా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. తాడేపల్లిలోని పెనుమాక గ్రామంలోని లబ్ధిదారులకు డబ్బులు పంపిణీ చేయనున్నారు. సీఎం లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.