వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం

77చూసినవారు
వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం
వైసీపీ కీలక నేతకు ఏపీ సర్కార్ భారీ షాకిచ్చింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు నిలిపివేసింది. రూ.67 కోట్ల బిల్లులను నిలిపివేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 16 ఏళ్ల క్రితం చేసిన పనులకు ఇప్పుడు బిల్లులు చెల్లించడమేంటని అనుమానం వ్యక్తం చేసింది. కాగా, కంపెనీపై విజిలెన్స్ విచారణకు టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్