కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు కొరకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని వినయ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. అభ్యర్థి టీ. జీవన్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డితో కలిసి ఆలూరులోని కాపు ఫంక్షన్ హాల్ లో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి పార్టీ గెలుపు కొరకు పాటుపడాలన్నారు. నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.