డొంకేశ్వర్లో విద్యుత్ షాక్ తో నెమలి మృతి

62చూసినవారు
డొంకేశ్వర్లో విద్యుత్ షాక్ తో నెమలి మృతి
నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండల కేంద్రంలోని గోపాల్ రెడ్డి అనే రైతు పొలంలో శనివారం ఉదయం నెమలి పడి ఉండటం చూసి డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుధాకర్ కు సమాచారం ఇచ్చాడు. ఆయన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రతన్ ను వెంట బెట్టుకుని సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిశీలించి చూడగా విద్యుత్ వైర్లు తగిలి మృతి చెందినది అని తెలుసుకుని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి అక్కడే పూడ్చారు.

సంబంధిత పోస్ట్