చెరువులో పడి వివాహిత మృతి
వేల్పూర్ మండలం మైనర్ గుంట చెరువులో పడి వివాహిత మృతి చెందినట్లు ఎస్సై వినయ్ కుమార్ గురువారం తెలిపారు. పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి. అమీనాపూర్ గ్రామానికి చెందిన అంకాపూర్ నరసయ్య కూతురు లక్ష్మి(48) గా గుర్తించారు. ఆమె మానసిక వ్యాధితో భాదపడుతుందని ఎస్సై పేర్కొన్నారు. సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. ఆమె తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసీ దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్ కుమార్ పేర్కొన్నారు.