కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీల ధర్నా

1574చూసినవారు
అంగన్వాడి కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు కలెక్టర్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ అంగన్వాడీలను దొంగలుగా చిత్రీకరించే సిసి కెమెరాలు, బయోమెట్రిక్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని అలాగే మే నెలలో సెలవులు, అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్