తోర్తిలో ఘనంగా సావిత్రి బాయి పులే జయంతి

52చూసినవారు
తోర్తిలో ఘనంగా సావిత్రి బాయి పులే జయంతి
ఏర్గట్ల మండలం తోర్తి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కుండ సాయన్న, కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 193 జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కుండ సాయన్న మాట్లాడుతూ సావిత్రిబాయి ఫులే ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలనీ, పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్