బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి
భీంగల్ మండలం జాగిర్యాల గ్రామానికి చెందిన లింబాద్రి అనే వ్యక్తి బైక్ అదుపుతప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్మూర్ లో ఉన్న సోదరి దగ్గరికి వెళ్లిన ఆయన శనివారం రాత్రి తిరిగి వస్తుండగా సుదర్శన్ నగర్ తండా, జాగిర్యాల గ్రామాల మధ్య గల ప్రమాదకర మలుపు వద్ద బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడు. దీంతో లింబాద్రి అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.