అమెరికా లంచం కేసులో ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీకి ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే గౌతమ్ అదానీకి నోటీసు జారీ చేయాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అహ్మదాబాద్ కోర్టును ఆదేశించింది. దీంతో అదానీ పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నట్లే. గౌతమ్ అదానీకి సమన్లను వీలైనంత త్వరగా అందజేయాలని, ఇది విదేశీ కోర్టుకు సంబంధించినది కాబట్టి వీలైనంత త్వరగా ఈ విషయాన్ని పరిష్కరించాలని మంత్రిత్వ శాఖ కోర్టును కోరింది.