ఈతకు వెళ్లి యువకుడు మృతి

9670చూసినవారు
ఈతకు వెళ్లి యువకుడు మృతి
స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లిన యువకుడు మృతి చెందిన ఘటన ఎడపల్లిలో జరిగింది. మండాలనికి చెందిన నవీన్(22) గొర్రెలు మేపుతూ జీవనం సాగించేవాడు. వడ్డేపల్లి శివారులోని నిజాంసాగర్ డి కెనాల్లో ఈత కొట్టేందుకు గురువారం స్నేహితులతో కలిసి వెళ్లాడు. కెనాల్లో స్నానం చేస్తుండగా నీటి ప్రవాహం పెరగడంతో కొట్టుకుపోయాడు. అతడి స్నేహితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్